ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా

ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా

భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఇంగ్లండ్ చేరుకున్నాయి. పురుషుల, మహిళల జట్ల సభ్యులు లండన్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సౌతాంప్టన్ వెళ్లారు. ఈ నెల 18 నుంచి కోహ్లీ సేన సౌతాంప్టన్ లోనే న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్టుల సిరీస్ లో పాల్గొంటుంది.
టీమిండియా మహిళలు ఇంగ్లండ్ గడ్డపై ఒక టెస్టు, 3 వన్డేలు, పలు టీ20 మ్యాచ్ లు ఆడనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా.. యూకే నిబంధనల ప్రకారం భారత పురుషుల, మహిళల జట్ల సభ్యులు సౌతాంప్టన్ లోనే క్వారంటైన్ పూర్తి చేసుకోనున్నారు.